జబర్ధస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయ్యారు హైపర్ ఆది.  ఆ మద్య ఆది చేసిన కొన్ని స్కిట్స్ పై ఎన్నో వివాదాలు వచ్చినా అవేవీ పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా ఆది చేసే స్కిట్ కోసం ఎదురు చూస్తుంటారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు.  అదిరే అభి శిష్యుడుగా బజర్ధస్త్ కి పరిచయం అయిన ఆది తర్వాత తన స్వశక్తితో పైకి వచ్చాడు.  అదిరిపోయే పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తూ..హైపర్ ఆది - రైజింగ్ రాజు కాంబినేషన అంటేనే ఎంతో క్యూరియాసిటి కలిగేలా చేశాడు.


గత మూడు నెలల క్రితం ఏపిలో ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాన్ స్థాపించి జనసేన పార్టీ తరుపు నుంచి జబర్ధస్త్ ఆది ప్రచారం చేశారు.  పవన్ కళ్యాన్ కి అమిత భక్తుడైన ఆది ఆయన తరుపు నుంచి కొన్నిసార్లు డిబెట్లలో గట్టిగానే మాట్లాడారు. ఆ మద్య కత్తి మహేష్ పై పెద్ద ఎత్తున మాటల యుద్దానికి దిగాడు.  జనసేన పార్టీ గురించి కూడా బాగానే మాట్లాడారు ఆది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ అది ఊహించని విధంగా కామెంట్ చేశారు. భీమవరం - గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు ఓటమి ఎదురైనా సంగతి తెలిసిందే. 


ఈ సందర్భంగా హైపర్ ఆది తనదైన శైలిలో కామెంట్ చేశాడు.  ‘మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈ రోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు.. తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే’ అంటూ ఆది చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్ కౌంటర్లువేస్తూ వచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: