ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ఫ్యాన్ గాలికి గల్లంతు కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు పై కోపంగా ఉన్న వాళ్లంతా మెల్ల మెల్లగా బయటకు వస్తు సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ పై చంద్రబాబు పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


విషయంలోకి వెళితే గత కొద్ది రోజుల క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ట్విట్టర్లో ప్రకటించి విజయవాడకు వస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఏపీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకి మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో జరిగాయి.


అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చావుదెబ్బ తెగులా ఏపీ ప్రజలు ఓటు ద్వారా తెలపడంతో..రాంగోపాల్ వర్మ చంద్రబాబుపై రెచ్చిపోతున్నారు. రాబోయే ఆదివారం గతంలో ప్రకటించిన ప్రదేశంలోనే మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. బస్తీమే సవాల్ ఎవరైనా ఆపొచ్చు దమ్ముంటే అంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా ఈ మీడియా సమావేశానికి ఎన్టీఆర్ నిజమైన అభిమానులురావాలని కూడా పిలుపునిచ్చారు. ఇదంతా ఎన్టీఆర్ కలలోకి వచ్చి చెప్పారని అందుకే తాను చేస్తున్నాం అని అంటున్నారు రాంగోపాల్ వర్మ.  



మరింత సమాచారం తెలుసుకోండి: