అనుష్క నటించిన భాగమతి సినిమా వచ్చి దాదాపు సంవత్సరం పైనే అయిపోయింది. సైరా, రాజమౌళీ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికి వాటిలో ఎంతవరకు నిజముందో తెలీదు. కానీ స్వీటి ఫ్యాన్స్ మాత్రం చాలా గ్యాప్ వచ్చిందని తెగ ఫీలవుతున్నారు. ఈ సంవత్సరంలోనైన స్వీటీ సర్‌ప్రైజ్ ఇస్తుందా అని. అనుకున్నట్టుగానే సర్‌ప్రైజో, షాకో గానీ గట్టిగానే ఇచ్చేసింది. సైలెంట్‌గా 'సైలెన్స్' సినిమా మొదలెట్టేసింది. ఈ సినిమాకు తెలుగులో 'నిశ్శభ్దం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఎక్కువ హడావిడి లేకుండా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ లాంగ్వేజ్ సినిమా కోసం చాలా రోజుల తర్వాత అనుష్క మేకప్ వేసుకుంది. యుఎస్ లో అఫీషియల్ గా మొదలైన ఈ సినిమాను కోన వెంకట్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో 'నిశ్శబ్దం', ఇంగ్లీష్ లో 'సైలెన్స్' గా టైటిల్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం మిగిలిన భాషలలో కూడా ఇదే అర్థం వచ్చేలా టైటిల్ ని పెడతారని సమాచారం.


ఇక 'నిశ్శబ్దం'లో మాధవన్ కీలక పాత్ర పోషిస్తుండగా అంజలితో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. వీళ్ళతో పాటు సుబ్బరాజు కూడా నటిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమా కథ గురించి ఏ చిన్న లీక్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది. టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'నిశ్శబ్దం' విడుదల తేది గురించి ఇంకా సమాచారం లేదు. టెక్నీకల్ టీమ్ కి సంబంధించిన డీటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: