టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అందాల బొమ్మ అనుష్క ‘బాహుబలి2’,‘భాగమతి’సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. ఒకదశలో అనుష్క అసలు సినిమాల్లో నటిస్తుందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. బాగా లావు కావడం..సరైన కథ ల విషయం గురించి వెయిట్ చేయడం..ఆ మద్య కోన వెంకట్ తో ఓ సినిమా ఉందని చెప్పినా అది ఇప్పటి వరకు పట్టాలేక్కక పోవడం ఇలా ఎన్నో ట్విస్ట్ లు అనుష్క విషయంలో జరుగుతూ వచ్చాయి.
తాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ..ఇప్పుడు నిశ్శబ్దం అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. మరోసారి కూడా బేబీ థ్రిల్లర్ జానర్ ని ఎంచుకుంది. భాగమతి అనంతరం ఎన్ని కథలొచ్చినా లెక్క చేయని అమ్మడు సైలెన్స్ అనే డిఫరెంట్ స్క్రిప్ట్ ను ఎంచుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం మొదలయ్యింది.
హేమంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లోకి కూడా డబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు హేమంత్ ఇంతకుముందు తెలుగులో మంచు విష్ణు 'వస్తాడు నా రాజు' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.