గత కొద్ది రోజులుగా నాగబాబుకు అలీ షాక్ ఇచ్చాడు అని వస్తున్న వార్తలకు నాగబాబు తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. ఎన్నికల సందర్భంగా ‘జబర్దస్త్’ కార్యక్రమం నుండి రోజా నాగబాబులు ఆకార్యక్రమం నుండి తప్పుకోవడంతో మీనా శేఖర్ మాష్టర్లతో చాల ఎపిసోడ్స్ నిర్వహించి మధ్యలో ఒకనాటి హీరోయిన్ సంఘవిని కూడా రంగంలోకి దింపారు.

అయితే ఎన్నికలు హడావిడి ముగిసిన తరువాత రోజా తిరిగి ‘జబర్దస్త్’ కార్యక్రమంలో రీ ఎంట్రీ ఇచ్చినా నాగబాబు కనిపించలేదు. ఆతడి స్థానంలో అలీ రంగప్రవేశం చేయడంతో నాగబాబు స్థానాన్ని ఆలీతో కవర్ చేసారు అంటూ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై నాగబాబు కూడ స్పందించలేదు.

అయితే అనూహ్యంగా నాగబాబు రోజాతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రోమోను ఈ టివి ప్రసారం చేయడంతో మెగా అభిమానులు అంతా జోష్ లో ఉన్నారు. దీనితో అలీ స్థానంలోకి నాగబాబు వచ్చాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే త్వరలో జరగబోతున్న మంత్రి వర్గ కూర్పులో రోజాకు స్థానం గ్యారెంటీ అని అంటున్నారు.

దీనితో నాగబాబుకు జోడి గా ఎవరుని కొనసాగిస్తారు లేదంటే నాగబాబు అలీలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారా మంత్రిగా ఉండి కూడ రోజా ఈకార్యక్రమం నిర్వహించ గలుగుతుందా అంటూ అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి జరిగిన ఈ లేటెస్ట్ పరిణామంతో ఈ కార్యక్రమం పై నాగబాబు పట్టు మరొకసారి రుజువైంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: