ప్రశాంత్ నీల్ లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు తీసే సాండిల్ వుడ్లో కేజీఎఫ్ అనే భారీ సినిమాను తీసి కన్నడ , తెలుగు, హిందీ భాషల్లో భారీ విజయాన్ని అందుకున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే సినిమాలో సరికొత్త కథకు సెంటిమెంట్ జోడించి స్టార్ డైరెక్టర్గా మారాడు. అప్పటికే సినిమాలు తీసినప్పటికీ కేజీఎఫ్ స్థాయిలో పేరు మాత్రం లేదు.

ప్రస్తుతం ఈ డైరెక్టర్ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా సెట్స్ మీద ఉంది. ఈ దర్శకుని తరువాత సినిమా తెలుగులో మైత్రీ మూవీ బ్యానర్లో ఉండబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఈ డైరెక్టర్ దగ్గర ఉండటంతో ప్రశాంత్ నీల్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ మొదలు కాబోతున్నట్లే.

ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం మహేశ్ బాబు లేదా జూనియర్ ఎన్టీయార్లలో ఎవరో ఒకరికి ఉంది. పవన్ కల్యాణ్ దగ్గర మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఉన్నప్పటికీ పవన్ కు సినిమాల మీద ఆసక్తి లేకపోవటంతో పవన్ ఈ సినిమాలో నటించే చాన్సైతే లేదు. మరి మైత్రీ మూవీ మేకర్స్ మహేశ్ ఎన్టీయార్లో ఏ హీరోకు అవకాశం ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: