బాలీవుడ్ హీరోయిన్స్ 40 లో కూడా రెచ్చిపోయి అందాలను ఆరబోయటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మలైకా అరోరా.. మందిరా బేడి.. శిల్పా శెట్టి..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదిగా ఉంది. వీళ్ళందరూ జిమ్ముల చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకునే టైపు.  కసరత్తు చెయ్యలేదంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. అందుకే నలభైల నుండి యాభైలలో కి హైవే ప్రయాణం చేస్తూ ఉన్నా ఫిట్టుగా ఉంటారు. సోషల్ మీడియాలో మంటలు పెడుతూ ఉంటారు.  ఈ లిస్టులోనే ఉన్న మరో భామ అమీషా పటేల్.  


హృతిక్ డెబ్యూ ఫిలిం 'కహో న ప్యార్ హై' సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్  ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులో పవన్ సినిమా 'బద్రి' లో కూడా హీరోయిన్ గా నటించింది.  మొదట్లో కెరీర్ బాగానే ఉంది కానీ గత కొన్నేళ్ళుగా విజయాలేమీ సాధించలేదు.  అయితే కెరీర్ తో సంబంధం లేకుండా కసరత్తులు చేయడం సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం.. ఇలా కాలం గడుపుతూ ఉంది.


ఈమధ్య ఫేస్ లో కాస్త వయసు తెలుస్తోంది కానీ ఒంపు సొంపుల ఇంపు.. కవ్వింపు మాత్రం నానో మీటర్ కూడా తగ్గడం లేదు. తాజాగా తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది.  చిత్రమైన విషయం ఏంటంటేఈ ఫోటోలకు ఒక్క కామెంట్ లేదు.  లైకులు సంఖ్య బాగానే ఉంది కానీ నెటిజనులు అమీషాను పెద్దగా పట్టించుకోవడం లేదని మనం గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు.  అందాల విందు చేస్తున్నా నెటిజనులు కామెంట్లు చేయకపోవడం ఏంటో.  ఇక సినిమాల విషయానికి వస్తే అమీషా ప్రస్తుతం 'దేశి మ్యాజిక్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: