తెలుగు సినిమాలలో ఒక న్యూ ట్రెండ్ కు ‘అర్జున్ రెడ్డి’ మూవీ ద్వారా శ్రీకారం చుట్టిన దర్శకుడు సందీప్ వంగా ఒక సంచలనం. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ మూవీని కబీర్ సింగ్ గా రూపొందిస్తున్న ఈ దర్శుకుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. 

ప్రస్తుతం తాను తీస్తున్న ‘కబీర్ సింగ్’ షూటింగ్ సమయంలో తనకు కొడుకు పుట్టిన విషయాన్ని వివరిస్తూ తనకు పుట్టిన కొడుకుకి ‘అర్జున్ రెడ్డి’ అని పేరు పెట్టిన విషయాన్ని తెలియచేసి అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా ఆసినిమా పట్ల తనకు  ఉన్న కమిట్మెంట్ ను తెలియచేసాడు. సాధారణంగా ఒక దర్శకుడు తనకు పుట్టిన పిల్లలకు తాను తీసిన సినిమా పేరు పెట్టిన సందర్భాలు గతంలో ఎక్కడా వార్తలలో రాలేదు.

అయితే ఈవిషయంలో కూడ సందీప్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసాడు అనుకోవాలి. ఇదే సందర్భంలో తాను బాలీవుడ్ లో తాను షాహిద్ కపూర్ తో తీసిన కబీర్ సింగ్ గురించి మాట్లాడుతూ ఈమూవీని బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసే విషయంలో తాను చాల కష్టపడిన విషయాలను వివరించాడు. ముంబాయిలో పుట్టిన ఒక పంజాబీ అబ్బాయి ఢిల్లీలో మెడిసిన్ చదివే విద్యార్ధిగా చూపించే విషయంలో తాను చాల జాగ్రత్తలు తీసుకున్నానని అంటూ ఉత్తరాది అబ్బాయిల బాడీ లాంగ్వేజ్ ని తాను చాల సునిశితంగా పరిశీలించిన విషయాలను బయటపెట్టాడు. 

అయితే తన పరిశీలనలో పంజాబీ సింగ్ ల అలవాట్లు తెలంగాణ రెడ్ల అలవాట్లు ఫుడ్ విషయంలో అదేవిధంగా మందు విషయంలో మరీ ముఖ్యంగా భావోద్వేగాల విషయంలో చాల పోలికలు ఉన్న విషయాలను తాను గుర్తించానని సందీప్ చెపుతున్నాడు. ఈనెల విడుదల కాబోతున్న ‘కబీర్ సింగ్’ గ్యారెంటీ హిట్ అని చెపుతూ మహేష్ తో తాను తీయాలి అని భావిస్తున్న ఒక క్రైం స్టోరీ స్క్రిప్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉందని చెపుతూ మహేష్ తో తాను తీయబోయే సినిమా అవకాశాలు ఇంకా ఉన్నాయి అంటూ సంకేతాలు ఇస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: