‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని ఈనెల మొదలు పెట్టడానికి అనిల్ రావిపూడి అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు. ఈమూవీలో మహేష్ ఆర్మీ మేజర్ క్యారెక్టర్ చేస్తున్న నేపధ్యంలో ఈమూవీ కోసం మహేష్ బాడీ పెంచుతాడనే లీకులు వచ్చాయి. అయితే మహేష్ ఎలాంటి ఎక్సర్ సైజులు చేయాల్సిన పనిలేదని కొత్త గెటప్స్ కూడా ట్రై చేయనక్కరలేదని అనిల్ రావిపూడి మహేష్ కు స్పష్టం చేయడంతో మహేష్ ప్రస్తుతం హాయిగా తన భార్యా పిల్లలతో కలిసి సమ్మర్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
వాస్తవానికి ఈ మూవీ కధలో మహేష్ చేసే మేజర్ పాత్ర పరిధి చాలా చిన్నది అని తెలుస్తోంది. ఈమూవీ కథ అంతా విలేజ్ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం జర్మనీలో హాలిడే ట్రిప్ పూర్తి చేసుకున్న మహేష్ ఫ్యామిలీ ఇప్పుడు ఇటలీలో ఉన్నాడు. ఆ తరువాత మహేష్ లండన్ కు వెళ్లి ఇండియా పాకిస్తాన్ దేశాలు ఆడబోతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూసి ఇండియా తిరిగివచ్చి 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ స్టార్ట్ చేస్తాడు అని తెలుస్తోంది.
ఈచిత్రాన్ని అయిదు నెలలలో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తానని అనిల్ రావిపూడి తేల్చేయడంతో మహేష్ కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయాడు. సాధారణంగా తనతో చేసే దర్శకులు కనీసం ఏడాది టైమ్ అడుగుతుంటారు. కానీ రావిపూడి మాత్రం కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదల చేసేస్తానని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
దీనితో రానున్న రోజులలో టాప్ దర్శకులు ఎవరైనా మహేష్ తో సినిమా చేయాలి అంటే ఆరు నెలలలోపే సినిమాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమా బడ్జెట్ కూడ మహేష్ సినిమాలకు భిన్నంగా ఉండబోతున్న నేపధ్యంలో ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ కు అనిల్ రావిపూడి తెర తీస్తున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి..