ఇటీవల శ్రీ విష్ణు కథానాయకుడుగా వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి నివేత పేతురాజ్. అనంతరం తమిళ్ లో టిక్ టిక్ టిక్ సినిమాలో నటించిన ఈ భామ, ఇటీవల సాయి ధరమ్ తేజ్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన చిత్రలహరి సినిమాలో ఒక సపోర్టివ్ రోల్ లో నటించి మంచి పేరు సంపాదించింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో బ్రోచేరేవారెవరురా సినిమాతోపాటు అలానే మరికొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నివేత టాలీవుడ్ లో ఒక భారీ ఛాన్స్ పట్టేసినట్లు చెప్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందబోతున్న సినిమాలో ఇప్పటికే మెయిన్  హీరోయిన్ గా పూజ హెగ్డే ఎంపికకాగా, రెండవ హీరోయిన్ పాత్రకు ఆ చిత్ర యూనిట్ నివేత ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాక ఈ మేరకు నేటి ఉదయం త్రివిక్రమ్, ఆమెను కలిసి సినిమా కథ చెప్పడం జరిగింది, అయితే మంచి ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో తన పాత్ర బాగా నచ్చడంతో నివేత నటించడానికి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. 

అంతేకాక అల్లు అర్జున్ సైతం ఆ పాత్రకు నివేత  అయితే సరిగ్గా సరిపోతుందని చెప్పడం జరిగిందట. ఇక ఆమె పాత్ర తాలూకు షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతోందని, అలానే సినిమాలో ఆమెది కూడా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని అంటున్నారు. ఇక ఈ విషయమై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. మరి ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వాత కనుక ఒకవేళ నిజం అయితే మాత్రం నివేత పేతురాజ్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి...!!  


మరింత సమాచారం తెలుసుకోండి: