మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ.. మే 31 వ తేదీన లాంఛనంగా ప్రారంభమైంది.  జూన్ 26 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది.  ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.  ఎక్కువ భాగం పల్లెటూరి నేపథ్యంలో నడుస్తుంది.  ఆర్మీ ఆఫీసర్ పల్లెటూరిలో ఏం చేసున్నాడు అన్నది కథ. 


పల్లెటూరిలో మహేష్ హంగామా మాములుగా ఉండదట.  రచ్చరచ్చ చేస్తాడని, మహేష్ లో ఎప్పుడు ఎవరు చూడని కోణాన్ని సరిలేరు నీకెవ్వరూలో చూపిస్తారంట.  అంతేకాదు, ఈ మూవీలో మంచి మెసేజ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. 


రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంటే.. విజయశాంతి కీలక పాత్రను చేస్తున్నారు.  దిల్ రాజు, అనిల్ సుంకరలు ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నా సంగతి తెలిసిందే.  మహేష్ బాబు యాంగిల్ లో కామెడీ ఎలా చేస్తాడో ఇప్పటి వరకు దాదాపుగా ఎవరికీ తెలియదు.  


సినిమాలో మాములుగా పంచ్ డైలాగులు ఉంటాయిగాని, పక్కా కామెడీ ఉండదు.  ఈ లోటును అనిల్ రావిపూడి తీర్చబోతున్నారు.  పక్కా ఎంటర్టైనర్ గా సినిమా రాబోతున్నది.  అంతా బాగుందిగాని, ఎంటర్టైనర్ సినిమాకు ముగ్గురు ప్రొడ్యూసర్ ఎందుకు అనే సందేహం కలుగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: