డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 'RRR' అనే మల్టీ స్టారర్ ప్రాజెక్టు లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా రాజమౌళి మార్కెట్ అంటే దేశ వ్యాప్తంగా ఉంటుంది ఇటువంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ కి అదిరిపోయే ప్లాన్ వేశాడు అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. విషయంలోకి వెళితే 'RRR' ప్రాజెక్టు తర్వాత తన మార్కెట్ ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి జూనియర్ ఎన్టీఆర్ గట్టిగానే ప్లాన్ వేసినట్లు సమాచారం.


జూనియర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన మార్కెట్ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కన్ను ఇతర రాష్ట్రాల పై పడింది..ఇందుమూలంగా నే తాను రాజమౌళి సినిమాల తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయంలో ఇతర భాషల్లో కూడా రాణించడానికి తగ్గ వాతావరణాన్ని అటువంటి సబ్జెక్టులను ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తదుపరి సినిమా ఉంటుందనే వార్త ప్రచారంలో ఉంది. దాదాపు ఈ కాంబో ఫిక్స్ అయినట్లేనని చెబుతున్నారు.


ప్రశాంత్ నీల్ కి 'కేజిఎఫ్'తో ఎంతటి గుర్తింపు దక్కిందో తెలిసిందే. అతడితో కలిసి పని చేయడం మంచి నిర్ణయమనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా సౌత్ తో పాటు నార్త్ లో కూడా తన ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ దొరుకుతుంది. అలానే డైరెక్టర్ అట్లీతో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని టాక్. విజయ్ తో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన అట్లీకి కమర్షియల్ గా ఎలాంటి సినిమాలు తీయాలో బాగా తెలుసు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకొనే పనిలో పడ్డారు జూనియర్ ఎన్టీఆర్..


మరింత సమాచారం తెలుసుకోండి: