మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సూపర్ హిట్టైంది.  సినిమా రిలీజ్ తరువాత మహేష్ క్యాజువల్ గా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ వెళ్తుంటాడు.  ఫారెన్ ట్రిప్ లో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వస్తుంటాడు.  మహర్షి విజయం తరువాత మహేష్ జర్మనీ వెళ్ళాడు.  జర్మనీ నుంచి ఇటలీ వెళ్లి అక్కడే కొన్ని రోజులు ఉన్నారు.  


ఇప్పుడు అక్కడి నుంచి మహేష్ ఇంగ్లాండ్ వెళ్లారు.  ఇంగ్లాండ్ లోని కేవింగ్టన్ లోని ఓవల్ స్టేడియం లో జరిగే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ను చూసేందుకు అక్కడికి వెళ్లారట.  ఆ మ్యాచ్ తరువాత కొన్ని రోజులు మహేష్ ఫ్యామిలి ఇంగ్లాండ్ లోనే ఉంటుంది. ఒకవేళ ఇండియా ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంటె.. అప్పటి వరకు మహేష్ అక్కడే ఉంటారట.  


అనంతరం ఇండియా కు వచ్చి సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ లో పాల్గొంటారు.  జూన్ 26 వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.  అనిక్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చేస్తారట.  ఇందులో రష్మిక హీరోయిన్.  విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.  


పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.  ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ముగ్గురు నిర్మిస్తున్నారు.ఇక మహేష్ 27 వ సినిమాగా రాబోతున్న సినిమా కోసం టాప్ దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: