బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉంటున్నారు. బాహుబలితో విదేశాల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అప్పట్లో రజినీకాంత్ కు అలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. జపాన్ కు చెందిన కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియా వచ్చారు.
అలా ఇండియా వచ్చిన వాళ్ళు ప్రభాస్ ఇంటిదగ్గర ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ జపాన్ నుంచి అని టెక్స్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జపాన్ నుంచి వచ్చి ప్రభాస్ ఇంటి దగ్గర అలా ఫొటో దిగడం విశేషం.
ప్రభాస్ సాహో సినిమా ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ పాటను త్వరలోనే షూట్ చేయబోతున్నారు. ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. జపాన్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే.