కొన్ని సార్లు ఇతర బాషల నుండి రీమేక్ చేసే సినిమాలు ఎంత సేఫో..అంతే రిస్క్ కూడా. కాయిన్ ఎగరేస్తే బొమ్మైనా పడొచ్చు బొరుసైనా పడొచ్చు. ఎందుకంటే రీమేక్ సినిమాలు సేఫ్ అని జనరల్ గా చాలామంది నమ్ముతారు కానీ అది నిజం కాదు.  ఒరిజినల్ సినిమాలోని ఆత్మను పట్టుకోకుండా సినిమాను తీసినా.. నేటివిటీని పట్టించుకోక పోయినా రిజల్ట్ తేడా కొట్టే అవకాశం గట్టిగా ఉంటుంది. ఇక ఒరిజినల్ తో పోలికలు కూడా ఫిలిం మేకర్లను.. హీరో హీరోయిన్లను చిరాకు తెప్పిస్తాయి. ఇక రీసెంట్‌గా తెలుగులో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలు 'ఎబీసిడీ'.. 'ఫలక్ నుమా దాస్' ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయన్న విషయం అందరికీ తెలిసిందే.  


ఇక ఈ రెండు రీమేక్ సినిమాలు జనాలను మెప్పించలేకపోవడంతో ఇప్పుడు అందరి ఫోకస్ సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓ బేబీ'పైకి షిఫ్ట్ అయింది. సరైన హిట్ లేని లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ సూపర్ హిట్ సినిమా 'మిస్ గ్రానీ' కి రీమేక్.  ఇప్పటికే పలు భాషలలోకి రీమేక్ అయిన ఈ సినిమా ప్రతిచోటా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దీంతో తెలుగులో కూడా ఈ రీమేక్ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతోందని 'ఓ బేబీ' టీమ్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.


ఇక ఈ సినిమా నిర్మాత డీ. సురేష్ బాబు రీసెంట్ గా మాట్లాడుతూ ఈ సినిమా ఒరిజినల్.. ఇతర రీమేక్ లలో ఉన్న మైనస్ పాయింట్లను సరిచేసుకుంటూ ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పిన మాట అందరికి తెలిసిందే. అయితే ఈ మార్పుచేర్పులే కాకుండా మన నేటివిటి కి తగ్గట్టు స్క్రిప్ట్ లో చేసిన మార్పులు కూడా బాగానే ఉంటాయి. ఇవన్నీ తెలుగులో ప్లస్ అవుతాయా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. ఒకవేళ ఈ సినిమా హిట్టైతే మాత్రం నందిని రెడ్డికి కాస్త కం బ్యాక్ మూవీ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: