ప్రస్తుతం అందరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఓ బేబీ. కొరియన్ సూపర్ హిట్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా కంప్లీ చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత 'మజిలీ' సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుని జోరు మీదుంది. మజిలీ కలెక్షన్స్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా సమంతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చేసిన సినిమా 'ఓ బేబీ'. సినిమా పనులు జరుగుతున్నాయని అందరు అనుకుంటున్నంతలోనే సినిమా షూటింగ్ పూర్తి చేశాం అంటూ ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా సినిమా ఫస్ట్ లుక్, టీజర్ తో థీమ్ ఏంటో దర్శకురాలు నందిని రెడ్డి క్లారిటీ ఇచ్చేసింది.

పూర్తి స్థాయి కామెడీ రోల్ చేయాలని నేను చాలా కాలంగా ఆశ పడుతున్నాను. అది దీంతో తీరిందని సమంత చెప్పిన నేపథ్యంలో సినిమాలో మస్త్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్‌గా సమంత ఈ సినిమా గురించి స్పందిస్తూ కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది. కొన్ని ఎమోషన్ సీన్స్ గుండె బరువెక్కేలా చేస్తాయంటూ సమంత చిన్న షాక్ ఇచ్చింది. తాత అమ్మమ్మ నానమ్మ లేకుండానే నా చిన్నతనం గడిచింది. అందుకే నందిని నన్ను వృద్దాశ్రమంకు తీసుకు వెళ్లింది. అక్కడ వారిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. 


ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది.  ఆ ఎమోషన్ ను నేను షూటింగ్ టైంలో క్యారీ చేయగలిగాను. అంటూ ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ కంటెంట్ కూడా ఉందని చెప్పేసింది. జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఓ బేబీ' సినిమాలో కీలక పాత్రలో లక్ష్మీ.. రావు రమేష్.. రాజేంద్ర ప్రసాద్ లు నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ లో రాబోతున్న ఈ సినిమాపై సమంత చాలా చాలా నమ్మకంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. సమంతకు ఈ సినిమా మరో సక్సెస్ ను తెచ్చి పెడుతుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: