రియల్ స్టార్ శ్రీహరి భార్య డిస్కో శాంతి శ్రీహరి మరణం తరువాత తానుపడ్డ మనోవేదన గురించి అదేవిధంగా తన పిల్లలను పెంచడానికి తానుపడ్డ కష్టాల గురించి ఈసందర్భంలో తమను ఏమాత్రం పట్టించుకోని ఇండస్ట్రీ వైఖరి గురించి అనేకమైన ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. శ్రీహరి చనిపోయిన తరువాత తన భర్త 500 కోట్లు సంపాదించి పెట్టి చనిపోయాడు అని వచ్చిన మీడియా వార్తలను చూసి శ్రీహరి తనకు తెలియకుండా 500 కోట్ల ఆస్థులు ఎక్కడ కొన్నాడో తెలియక తాను తన ఇల్లంతా ఆ ఆస్థుల డాక్యుమెంట్స్ కోసం వెతికిన సందర్భాన్ని వివరించింది. 

ఆ వార్తలను ప్రచారంలోకి తీసుకువచ్చిన వారు ఎవరైనా శ్రీహరి తనకు వదిలేసి వెళ్ళిన 500 కోట్ల ఆస్తులను చూపించగలిగితే అలా చూపించిన వ్యక్తికి తాను 300 కోట్లు ఇచ్చేస్తాను అంటూ ఓపెన్ ఆఫర్ డిస్కో శాంతి ప్రకటించింది. శ్రీహరి చనిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు తన కుటుంబం ఏలోటు లేకుండా బతకడానికి తాను తన ఆస్తులను తాకట్టు పెట్టిన విషయం ఎంతమందికి తెలుసు అంటూ ఈమె ప్రశ్నిస్తోంది. 

ప్రస్తుతం తనకొడుకు మేఘాంష్ హీరోగా మారుతున్నాడు కాబట్టి ఇక తన కొడుకు సంపాదిస్తే తాను హాయిగా సుఖపడాలి అని అనుకుంటున్నానని అంటూ తన కొడుకు మొదటి సినిమా ‘రాజ్ దూత్’ రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్న విషయాన్ని వివరించింది. అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరు ఎవర్నీ పట్టించుకోరనీ కేవలం అన్ని బాగున్నప్పుడు మాత్రమే ఎవరైనా ఫోన్స్ చేస్తూ పలకరిస్తారనీ తేడా వస్తే కనీసం పలకరించే వ్యక్తి కూడ ఇండస్ట్రీలో ఉండరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది డిస్కో శాంతి.

శ్రీహరి చనిపోయాక తాను రెండు చోట్ల పొలాలు అమ్మిన విషయాన్ని తన పిల్లలను హైదరాబాద్ లోని పెద్ద స్కూల్స్ లో చదివిస్తూ శ్రీహరి చనిపోయినా అదే స్థాయి కొనసాగించడానికి తాను పడ్డ పాట్లను వివరించింది. తన చిన్న కొడుకు మేఘాంశ్ ను హీరోగా పెద్ద కొడుకు శశాంక్ ను దర్శకుడుగా సెటిల్ చేయాలి అని కలలు కంటున్న డిస్కో శాంతి కలలు నెరవేరాలని కోరుకుందాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: