ప్రభాస్ కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ ఏదైనా ఉంది అంటే అందులో మొదటి వరుసలో రెబల్ చిత్రం నిలుస్తుంది. ఇప్పుడు సాహో చిత్రం కూడా అలాగే అవుతుందా అని గుబులు గా ఉన్నారు ప్రభాస్ అభిమానులంతా. బాహుబలి రెండు చిత్రాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోను రికార్డులని సృష్టించింది . అలా అని ప్రభాస్‌ చేసే సినిమాలన్నిటికీ అదే స్థాయిలో ఆదరణ వుంటుందని అనుకోవడానికి లేదు. బాహుబలి చిత్రానికి ప్రభాస్ బ్రాండింగ్‌ కన్నా రాజమౌళి బ్రాండింగ్ ఎక్కువగా ఉపయోగపడింది ఏ సినిమా చేసిన ఒప్పుకుంటారన్న అపనమ్మకం తో ఉన్నారేమో ప్రభాస్ . బాలీవుడ్‌ మార్కెట్‌ వచ్చింది కాబట్టి ప్రభాస్‌ చేసే సినిమాలన్నిటికీ యూనివర్సల్‌ అప్పీల్‌ వుండాలని అతని బృందం భావిస్తోంది.

చిన్న చిత్రంగా ప్రారంభమైన సాహో తర్వాత బడ్జెట్‌ పెంచుతూ పోయారు దర్శకుడు సుజిత్ . బాలీవుడ్‌ లో కూడా సాహో బజ్ ఉండేందుకు నటీనటుల్లో చాలా మందిని హిందీ చిత్ర రంగం నుంచి తెచ్చుకున్నారు. సంగీతం బాధ్యతలు కూడా బాలీవుడ్‌ త్రయం ‘శంకర్‌, ఎహ్‌సాన్‌, లాయ్‌’కి అప్పగించారు కానీ అతడు మధ్యలోనే తప్పియ్యడం హాట్ టాపిక్ గా మారింది . అయితే సినిమా మరో రెండున్నర నెలలలో విడుదల కానుంది అనగా వారి మ్యూజిక్‌ తెలుగువారి అభిరుచికి తగ్గట్టు లేదని రియలైజ్‌ అయి వారిని తొలగించారు.


ఇంకోవైపు ఇంత భారీ చిత్రాన్ని ఎలా ప్రమోట్‌ చేయాలనే దానిపై అస్సలు క్లారిటీ కనిపించడం లేదు. ఇంతవరకు విడుదల చేసిన పోస్టర్లు కానీ, ఇతర కాంటెంట్‌ కానీ అంతగా ఆకర్షించలేదు. ప్రభాస్‌ కాబట్టి తెలుగునాట క్రేజ్‌ ఎలాగో వుంటుంది. కానీ ఈ చిత్రానికి ఎలాంటి అప్పీల్‌ కోసమని ఇంత స్కేల్‌లో చేసారో అదయితే ఇంతవరకు కానరాలేదు. ట్రెయిలర్లు, పాటలు విడుదలయితే ఇతర ప్రాంతాల్లోను క్రేజ్‌ పెరుగుతుందని ఆశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: