ఏకే ఎంటర్టైన్మెంట్ అనగానే దూకుడు సినిమా గుర్తుకు వస్తుంది.  ఆ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా  వ్యవహరించింది. ఆగడు సినిమాకు కూడా కో ప్రొడ్యూసర్.  ఇప్పుడు మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకు కూడా ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది.  


ఈ సినిమాకు దిల్ రాజు కూడా మొదట నిర్మాత అన్నారు.  తరువాత దిల్ రాజు తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.  కానీ చివరకు దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  మే 31 వ తేదీన సరిలేరు నీకెవ్వరూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ లో మహేష్ బాబు కూడా చేరడం విశేషం.

ఇదిలా ఉంటె, ఏ కె ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తోంది.  మహేష్ సినిమాతో పాటు అల్లరి నరేష్ తో బంగారు బుల్లోడు, గోపీచంద్ తో చాణక్య, అలాగే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా అబ్దుల్ కలాం సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.  


చిన్న మీడియం సినిమాలకు నిర్మాతగా ఉంటూనే.. పెద్ద సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ రెండు బిజీగా మారిపోయారు.  మంచి కథ ఉంటె కొత్తవారైనా సరే ఏకే ఎంటర్టైన్మెంట్ ను అప్రోచ్ అయితే చాలు తప్పకుండా అవకాశం లభిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: