వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. ఇక బెజవాడకు చెందిన వర్మ ఎంతో కష్టపడి తెలుగు సినిమాల స్థాయి నుండి బాలీవుడ్ లోని అగ్రనటులతో సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. ఇక ఏదైనా అంశం పై తనదైన శైలిలో స్పందించే వర్మ, తాను చెప్పదల్చుకున్న విషయాన్నీ కుండబద్దలు కొట్టినట్లు చెప్తుంటారు. ఇటీవల తాను  తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రాలో విడుదల చేయకపోవడంతో వర్మ చేసిన హడావుడి అంత ఇంత కాదు. 

ఇకపోతే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధిచడం, అలానే ఆ పార్థి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ వర్మ కొన్ని ట్వీట్స్ కూడా చేసారు. ఇక అప్పుడపుడు మెగా హీరోలపై కూడా వర్మ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తుంటారు. ఇక నేడు అయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. నిజానికి నిన్న విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, తనను రెండు నియోజకవర్గాల్లో ఓడించడానికి భారీ స్థాయిలో కుట్ర జరిగిందని, అందుకోసం దాదాపుగా రూ.150 కోట్లవరకు ఖర్చు పెట్టారని విమర్శించారు. అయితే నేడు పవన్ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు తనను ఓడించడానికి రూ.150 కోట్ల డబ్బు ప్రజలకు పంచి అధికార, ప్రతిపక్షాలు కుట్ర చేసాయి అంటున్నారు కదా, నిజంగా మీరే వారికి నాయకుడుగా కావాలి అనుకున్నపుడు వారి నుండి డబ్బులు తీసుకుని మీకే ఓటు వేసి ఉండొచ్చు కదా, 

అంటే ప్రజలు డబ్బులు తీసుకోవడం అలవాటు పడ్డారని, లంచగొండులని అంటున్నారా అంటూ ఆయనను జస్ట్ అస్కింగ్ పేరుతో సూటిగా ప్రశ్నించారు. అయితే వర్మ చేసే వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని, అయన ఎప్పుడూ తనకు నచ్చని అంశాన్ని వివాదాస్పదం చేస్తూ ఉంటారు, వాటిని మేము లక్ష్యపెట్టం అంటూ కొందరు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తుంటే మరికొందరు, పవన్ ను ఇండైరెక్ట్ గా వర్మ టార్గెట్ చేయడం సరైనది కాదని అంటున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: