ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయి ఫుల్ బిజీగా మారింది. తిరిగి ఎక్కడా కూడా సినిమాల్లోకి రాకుండా ఎక్కువ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా రాజకీయ నేతగా ఎదిగారు విజయశాంతి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న విజయశాంతి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.


ఈ నేపథ్యంలో మహర్షి సినిమాతో మంచి టైమింగ్ లో ఉన్న మహేష్ బాబు తర్వాత సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానిపై స్పష్టత అయితే రాలేదు కానీ - ఇందులో విజయశాంతి తన మార్క్ చూపించబోతున్నారని తెలుస్తోంది. దీనికి కారణం తాజాగా బయటికొచ్చిన వార్తే.


‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం విజయశాంతి ఎన్నో కసరత్తులు చేస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. ఈ సినిమా కోసం ఆమె ఎక్కువ సమయం జిమ్లో గడుపుతున్నారని తెలిసింది. రీ ఎంట్రీని గ్రాండ్ గా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె కష్టపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటికొచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో పాత విజయశాంతిని చూడొచ్చని అభిమానులు సంబరపడిపోతున్నారు. మరోపక్క వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భరత్ అనే నేను, మహర్షి తర్వాత చేయబోయే సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ కొట్టి ఆలోచనలో ఉన్నాడట మహేష్.



మరింత సమాచారం తెలుసుకోండి: