సమంత పెళ్ళైన తరువాత ఇంకా బోల్డ్ గా మాట్లాడటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పెళ్లి తర్వాత కూడా రొమాన్స్ గురించి సమంత ఇంత ఓపెన్‌గా మాట్లాడటం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె చెప్పింది ఏ హీరో గురించి? అతనితో రొమాన్స్ విషయమై ఆమెకొచ్చిన ఇబ్బంది ఏమిటి? అసలు సమంత ట్వీట్‌లో ఏమని పేర్కొంది? వివరాల్లోకి పోతే.. ఇటీవలే రిలీజైన మజిలీ చిత్రంలో గృహిణిగా అదరగొట్టిన సమంత ప్రస్తుతం 'ఓ బేబీ' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది.


ఈ చిత్రంలో యంగ్ హీరో నాగశౌర్య- సమంత జోడీగా నటిస్తున్నారు. సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మునుపెన్నడూ చేయని డిఫెరెంట్ రోల్‌లో సమంత నటిస్తోంది. సినిమా అన్నాక రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం సాధారణమే. పైగా పెళ్లి తర్వాత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి సమంత అస్సలు వెనుకాడటం లేదు.


ఈ మేరకు తన తాజా సినిమా ఓ బేబీలో యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ చేయడం ఆమెకు చాలా కష్టంగా అనిపించిందట. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా వెల్లడించి షాకివ్వడం విశేషం. ఓ బేబీ సినిమాలోని రెండో పాట 'నాలో మైమరపు..' ఈ రోజు (జూన్ 10) సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న సామ్.. ''యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ చేయడమంటే అంత ఈజీ కాదు. ఆ విషయం నదిని రెడ్డికి, నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు'' అంటూ ఆశ్చర్య పరిచే ఆసక్తికర సందేశం పోస్ట్ చేసింది. అంతేకాదు నాగశౌర్య సిగ్గుపడుతుండగా.. ఆయన వైపే నవ్వుతూ తాను చూస్తున్న పిక్ కూడా షేర్ చేసింది సామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: