‘మహర్షి’ సక్సస్స్ ను ఎంజాయ్ చేస్తూ  హాలిడే ట్రిప్ లో ఉన్న మహేశ్ బాబు తన కొడుకు గౌతమ్ తో కలిసి నిన్న ఇంగ్లాండ్ లోని ఓవల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తూ తీసుకున్న సెల్ఫీని తన అభిమానులకు షేర్ చేసాడు. ప్రస్తుతం హాలిడే టూర్ లో ఉన్న మహేష్ తన టూర్ ను ముగించుకుని ఈనెల 15 ప్రాంతలో హైదరాబాద్ కు తిరిగి వచ్చి తన లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ ను జూలై ఒకటి నుండి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో షూట్ ప్రారంభిస్తాడని తెలుస్తోంది.  

ఈమూవీలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్న నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని ఒక ఆర్మీ క్యాంప్ లో ఆర్మీ అనుమతులు తీసుకుని కీలకమైన ఈ షెడ్యూల్ ను తీయబోతున్నట్లు టాక్. అదేవిధంగా ఈమూవీకి సంబంధించి మహేష్ రష్మికల మధ్య లవ్ ట్రాక్ ను ట్రైన్ జర్నీ నేపధ్యంలో తీయబోతున్నట్లు సమాచారం. 

మహేష్ కాశ్మీర్ నుండి తిరిగి తన ఊరికి తిరిగి వస్తున్నప్పుడు ట్రైన్ లో రష్మిక పరిచయం అయ్యే సన్నివేశాలు అన్నీ నవ్వు తెప్పించే విధంగా దర్శకుడు అనీల్ రావిపూడి తీయబోతున్నట్లు టాక్.   కాశ్మీర్ లో చిత్రీకరించే సన్నివేశాలు ఈమూవీకి అత్యంత కీలకం కావడంతో వానలు ఇంకా ఎక్కువ కాకుండానే ముందుగా కాశ్మీర్ ఆర్మీ సీన్స్ ను పూర్తిచేసి ఈయూనిట్ తిరిగి వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగిస్తుందని సమాచారం.

ఈమూవీలో కీలక పాత్ర పోషిస్తున్న విజయశాంతి హైదరాబాద్ షెడ్యూల్ నుండి మహేష్ తో జాయిన్  అవ్వబోతున్నట్లు సమాచారం. అనుకున్న విధంగా ఈమూవీని సంక్రాంతి రేస్ కు జనవరిలో విడుదలచేయాలి అంటే ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ లో ఒక్క రోజుకూడ వృథ కాకుండా అనిల్ రావిపూడి పక్కా షూటింగ్ ప్లాన్స్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: