మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 22 వ తేదీన ప్రారంభం కాబోతున్నది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్నది.
అనసూయ ఈ సినిమాలో ఏ పాత్ర చేస్తుంది అనే దాని గురించి ఇప్పటి వరకు తెలియదు. కీలక పాత్ర అని అంటున్నారు గాని పాత్ర ఏంటి అన్నది తెలియదు కాబట్టి.. సినిమాలో ఆమె రోల్ గురించి ఇప్పుడు క్యూరియాసిటీ ఉంది. దీనికి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఒకటి ఎంఆర్ఐ పాత్రకాగా, రెండో పాత్ర రైతు పాత్ర. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రకు హీరోయిన్ గా అనసూయ ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
కొరటాల శివ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇందులో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అనసూయను ఒక హీరోయిన్ గా తీసుకున్నారని ఒకరంటే.. లేదు కీలక పాత్రకోసమే తీసుకున్నారనే అంటున్నారు కొందరు. మరి ఈ పాత్ర ఏంటి అన్నది తెలియాలి.