సమంత పెళ్ళైన తరువాత కూడా బోల్డ్ వ్యాఖ్యలు చేయడంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. ఓ బేబీ పాటల్లో నాగశౌర్యతో కలిసి రొమాన్స్ చేయడం చాలా చెత్తగా, కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆయనకు విపరీతమైన సిగ్గు. నాగశౌర్యను రొమాన్స్‌ మూడ్‌లోకి దించేందుకు ఆయనకు ఇష్టమైన కుక్కల గురించి మాట్లాడితే మూడ్‌లోకి వచ్చేవారు. నేను అంతగా కష్ట పడాల్సి వచ్చింది అని సమంత వెల్లడించింది. 


నాగశౌర్య గురించి సమంత చెప్పిన మాటలకు దర్శకురాలు నందినీ రెడ్డి వత్తాసు పలికింది. శౌర్య గురించి సమంత చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమే. నాగశౌర్య తీరు చూసి నేను టెన్షన్‌గా ఫీలయ్యాను. ఆయనను చూసి ఓరి దేవుడో అని అనుకొన్నాను. అతనికి అంత సిగ్గుందని నాకు అసలే తెలియదు. హీరోయిన్‌ ఓ చోట ఉంటే.. దాదాపు 20 అడుగుల దూరంలో నాగశౌర్య ఉండేవాడు అని నందినీరెడ్డి చెప్పింది. 


ఓ బేబీ సినిమా పాటల షూటింగ్ సందర్భంగా నాగశౌర్యను రొమాంటిక్ మూడ్‌లోకి తెప్పించడానికి సమంత చాలా కష్టపడింది. ఆయనకు కుక్కలంటే చాలా ఇష్టమని తెలిసి ఆమె వాటికి గురించి మాట్లాడి చొరవ తీసుకొన్నారు. దాంతో మెల్లగా రొమాంటిక్ మూడ్‌లోకి నాగశౌర్య వచ్చాడు. తమ ఇంట్లే ఉండే పెంపుడు కుక్క హాష్ అక్కినేని గురించి చెప్పి నాగశౌర్యను ఓ మూడ్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది అని నందినీ రెడ్డి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: