డైరెక్టర్ తేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన యంగ్ హీరోస్ లో మంచి సక్సస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు నితిన్. జయం సినిమాతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న నితిన్ ఆ తర్వాత వినాయక్ డైరెక్ట్ చేసిన దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని స్టార్ గా ఎదిగాడు. 15 ఏళ్ల ప్రయాణంలో హిట్ లు ఫ్లాపులు అన్నీ చూసాడు హీరో నితిన్. కానీ ఎప్పుడూ ఎక్కువగా గ్యాప్ తీసుకోలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇక ఇప్పటినుంచి స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలని డిసైడ్ అయిపోయాడు. దాదాపు 10 నెలలకు ఫైగా స్క్రిప్ట్ లు వింటూ ఖాళీగానే వున్నాడు. 


నితిన్ తో సినిమా చేయడానికి డైరక్టర్ వెంకీ కుడుమల రెడీ, తీయడానికి బ్యానర్ కూడా రెడీ కానీ..వాళ్లంతట వాళ్లు ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ అనేవరకు నితిన్ ఓకె అనలేదు. 
ఎట్టకేలకు అన్ని సెట్ అయి స్క్రిప్ట్ రెడీ అయింది. త్వరలో సెట్ మీదకు వస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో నితిన్-రష్మిక మందన్న నటించే సినిమాకు ఈ బుధవారం ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. పైకి ప్రకటించడం లేదు కానీ ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలని యూనిట్ టార్గెట్ పెట్టేసుకుందట. 


ఆ విధంగా విడుదల చేస్తే 2019లో నితిన్ కు సినిమా లేదు, ఛలో లాంటి డీసెంట్ హిట్ తరువాత వెంకీకి కూడా 2019లో సినిమా లేదు అనేమాట రాకుండా ప్లాన్ చేసుకున్నారు.
ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ అయిపోగానే వెంకీ అట్లూరి-నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్ లో అదే బ్యానర్ లో మరో సినిమా స్టార్ట్ చేసి 2020 సమ్మర్ కు విడుదల చేసే విధంగా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు నితిన్. మరి ఈ రెండు సినిమాలతో నితిన్ కం బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: