మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ చేయాలి.. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కు ఎక్కువ సమయం పడుతుంది.  ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సాంగ్ షూట్ పూర్తయింది. 

ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి కి మారింది.  అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  అక్కడి షూటింగ్ తరువాత సినిమా షూటింగ్ పూర్తవుతుంది.  

ఇక ఈ సినిమాను అక్టోబర్ 2 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.  

నయనతార, తమన్నా తదితరులు ఈ సినిమాలో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు.  పాన్ ఇండియన్ మూవీగా తెరెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: