మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ చివరి దశకు
చేరుకుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్
చేయాలి.. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కు ఎక్కువ సమయం
పడుతుంది. ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సాంగ్ షూట్ పూర్తయింది.
ప్రస్తుతం
ఈ సినిమా షూట్ హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి కి మారింది. అక్కడ కొన్ని
కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడి షూటింగ్ తరువాత సినిమా
షూటింగ్ పూర్తవుతుంది.
ఇక ఈ సినిమాను అక్టోబర్ 2
వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ
సినిమా కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అమిత్ త్రివేది
సంగీతం అందిస్తున్నారు.
నయనతార, తమన్నా
తదితరులు ఈ సినిమాలో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియన్
మూవీగా తెరెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్
సేతుపతి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.