బోయపాటి తదుపరి చిత్రం బాలక్రిష్ణతో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇంతవరకు ఆ సినిమా గురించి ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే బాలక్రిష్ణ ఈ సినిమాని తానే నిర్మిద్దామనుకున్నాడట. కానీ "ఎన్టీఆర్" బయోపిక్ తీసి నష్టాన్ని మూటగట్టుకున్నాడు.

మళ్ళీ ఈ సినిమా అంటే నష్టపోయిన బయ్యర్లందరూ వస్తారేమోనని భయంతో వెనక్కి తగ్గాడట. అందుకని వేరే నిర్మాతతోనే ఓకే చేద్దామనికుంటున్నాడని టాక్.

వేరే నిర్మాతతో ఈ సినిమా చెయ్యడానికి బోయపాటి డెబ్బయి కోట్ల బడ్జెట్ ఇచ్చాడట.

ఇది కేవల సినిమా మొదలు పెట్టడానికి ముందు వేసుకున్న ఎస్టిమేషన్ కాబట్టి సినిమా పూర్తయ్యేసరికి ఎటూ లేకున్నా ఇంకో పది కోట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని నిర్మాతలు ముందుకు రావడానికి భయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: