సెలెబ్రిటీలు ఏది చేసినా ప్రత్యేకమే.  వారు చేసే ప్రతీ పని పట్ల జనాలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారిని కలుసుకోవడానికి నానా తంటాలు పడతాం. వారితో ఒక్క సెల్ఫీ దిగడానికి ఎగబడిపోతాము. అటువంటిది  సెలెబ్రిటీలు మనతో పాటు బస్సులో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది.

ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును నిజమే . టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస ఇలానే చేసాడు.   ఆ ప్రయాణాలకి సంబంధించిన ఫోటోలను డైలీ కమ్యూట్ అనే ఇన్స్టా ఖాతా ద్వారా నెటిజన్లకు పంచుకున్నాడు. ఒక సాధారణ ప్రయాణికుడిగా మారిపోయి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసాడు.సిటీ బస్ లో ప్రయాణం తనకి మొదటిసారని చాలా ఎంజాయ్ చేసానని చెప్పాడు.

ఇక హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నఫోటోకి , మెట్రో చాలా కన్వీనియెంట్ గా ఉందని, ఇటువంటి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలని అభిప్రాయపడ్డాడు.

అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షించిన ఫోటోలు రెండు ఉన్నాయి. షేర్ ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణం చేయడం. అలాగే బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, ఇది కేవలం ఫోటో కోసమే చేసానని, ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించడానికి కాదని చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: