భారత్ ఆల్ రౌండర్ , విధ్వంసకర బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ తాను క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుండి తాను వైదొలుతున్నానని ప్రకటించాడు.

అతని ప్రకటన వెలువడిన తర్వాత, యువరాజ్ సతీమణి ’హెజెల్ కీచ్’ ఇన్స్టా లో  " ఒక శకం ముగిసింది "అంటూ పోస్ట్ చేసింది. అయితే దీనిపై పలువు సినీ తారలు స్పందించారు.

అందులో కిమ్ శర్మ ఒకరు. కిమ్ శర్మ , యువరాజ్ సహజీవనంలో ఉన్నారని పుకార్లు షికార్లు చేసాయి. అవి నిజమో కాదో తెలియదు. ఇక ప్రస్తుతానికొస్తే  హెజెల్ కీచ్ చేసిన పోస్టుకి కిమ్ శర్మ యువరాజ్ సాధించిన విజయాలను కీర్తిస్తూ వ్యాఖ్యలు చేసింది..

యువరాజ్ కి గతంలో చాలా మందితో సంబంధాలున్నాయని పుకార్లు వచ్చాయి. వారిలో ప్రీతి జ్ంగానియా, మినిషా లింబా,శమిత శెట్టి, రియాసేన్, ఇంకా దీపికా పదుకొనే కూడా ఉన్నారు. ప్రీతి జింటా పేరు కూడా వచ్చినప్పటికి ఆ పుకార్లని ఆమె కొట్టిపారేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: