మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాల కృష్ణ, నాగార్జున, వెంకటేష్..ఇలా స్టార్ హీరోస్ దగ్గర్నుంచి యంగ్ హీరోస్ వరకు అందరి సినిమాలకు సంగీతమందించిన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గత కొంత కాలంగా సరైన అవకాశాలు లేక కొన్ని సినిమాలకు అడపా దడపా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇస్తూ కాలం గడుపుతున్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో మణిశర్మ పేరు బాగా వినిపించింది. అయితే కొన్నాళ్ళుగా దేవీ శ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రుబెన్స్, గోపీ సుందర్..వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఫాం లో ఉండటంతో మణిశర్మ గ్రాఫ్ కంప్లీట్‌గా పడిపోయింది. అయితే ఈ మధ్య పూరీ-రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.


జనరల్‌గా ఓ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ను ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం బాగా ఫాం లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ని ఫిక్స్ చేసుకుంటారు. కాస్త కొత్తదనం, వెరైటీ కావాలనుకుంటే పక్క పరిశ్రమల నుంచి కూడా తెచ్చుకుంటారు. కానీ చేతిలో సినిమాలు లేక ఫేడవుట్ అయిన సంగీత దర్శకుడు ఎందుకు గుర్తొస్తాడు? రామ్ కు మాత్రం మణిశర్మ గుర్తుకొచ్చాడట. అందుకే అతడ్ని పెట్టుకున్నామని చెప్తున్నాడు.


ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టోరీ మొత్తం విన్నాక..సంగీత దర్శకుడిగా ఎవర్ని పెట్టుకుందామనే టాపిక్ వచ్చినప్పుడు నాకు వెంటనే మనసులో మణిశర్మ పేరు తట్టింది. అదే టైం లో పూరి జగన్నాథ్ కు కూడా అదే పేరు గుర్తొచ్చింది. వెంటనే అతడ్ని ఫిక్స్ చేశాం. అని రామ్ చెప్పడం అందరికి కాస్త ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే ప్రస్తుతం మణిశర్మకు సినిమాలు లేవు కాబట్టి రెమ్యునిరేషన్ బాగా తగ్గించి ఆఫర్ చేయోచ్చనే ఆలోచనతో మణిని ఫిక్స్ చేసుంటారని ఇండస్ట్రీ టాక్. ఇది వాస్తవం అయిండొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత బడ్జెట్ తగ్గుతుంది కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: