టాలీవుడ్ డైరెక్టర్స్ లో తనకంటూ కొంత ప్రత్యేకతను సంపాదించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదట కథ, మాటల రచయితగా తన ప్రయాణాన్ని మొదలెట్టిన త్రివిక్రమ్ , ఆ తరువాత దర్శకుడిగా మారారు, ఇక టాలీవుడ్ లో ఆయనకు మాటల మాంత్రికుడు అనే పేరుంది. ఇకపొతే అయన సినిమా ఏదైనా విడుదల అవుతుందంటే చాలు ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి ఉంటుంది. అయితే అయన దర్శకత్వంతో పాటు కొన్నాళ్ల నుండి అయన పనిచేస్తున్న హారిక హాసిని నిర్మాణ సంస్థలో కొంత భాగస్వామిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

అంతేకాక అయన ఇప్పుడు మరొక నయా బిజినెస్ లోకి దిగారట. అదే థియేటర్ బిజినెస్ అంటున్నారు. తనకు తెలిసిన వారి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఒక థియేటర్ ని కొనుగోలు చేసిన త్రివిక్రమ్, దానిని సరికొత్త హంగులతో ఆధునీకరించి, నిర్వహణ బాధ్యతలు తన బందువులకు అప్పగించారట. ఎప్పటికపుడు విడుదలయ్యే సినిమాలతో పాటు ఇకపై తాను తీయబోయే సినిమాలన్నీ కూడా అందులోనే విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఇటీవల జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, దాని తరువాత ఏఎంబి సినిమాస్ పేరుతో హైదరాబాద్ లో గ్రాండ్ గా మల్టిప్లెక్స్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 

అయితే ఆ విధంగా ప్రస్తుతం అయన మిత్రుడు త్రివిక్రమ్ కూడా ఓవైపు సినిమా నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉంటూ సినిమా హాల్ నిర్వాహకుడిగా ప్రారంభించిన ఈ నయా బిజినెస్ ఆయనకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. నిజానికి ఈ వార్తపై ఇప్పటివరకు త్రివిక్రమ్ నుండి కానీ, ఆయన సన్నిహితుల నుండి కానీ ఎటువంటి సమాచారం లేనప్పటికీ ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: