బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రాబోతున్న సాహో సినిమా టీజర్ ఈరోజు ఉదయం 11:23 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న సాహో టీజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.  


ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా టీజర్ సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యింది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. రన్ రాజా రన్ అనే సినిమా తీసి సెకండ్ మూవీనే ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నాడు సుజిత్.


ఇక ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచగా సినిమా మీద ఓ అవగాహన కలిగించేలా వచ్చే టీజర్ పై మాత్రం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే సంచలనాలు మొదలు పెట్టాలని చూస్తున్నారు.


సినిమాలో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా హాలీవుడ్ సినిమా అప్పీల్ తెచ్చేలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కించారట. టీజర్ కనుక అనుకున్న విధంగా క్లిక్ అయితే సాహో మెస్మరైజ్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ప్రభాస్ మాత్రం సాహో కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా తప్పకుండా మరో సంచలనంగా మారుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: