ఇంగ్లండ్ లో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత టీం ఆడిన రెండు మ్యాచులు గెలిచి జోష్ మీద ఉంది. ఈ జోష్ లో భాగంగానే మన వాళ్ళు సల్మాన్ ఖాన్ నటించిన" భారత్" సినిమాను చూశారు. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

"భారత్" సినిమా చూసిన తర్వాత కేదార్ జాదవ్ ఈ ఫోటోని షేర్ చేసాడు. ఆ ఫోటోలో హార్దిక్ పాండ్య, ఎమ్.ఎన్ ధోని, శిఖర్ ధావన్, ఇంకా కె ఎల్ రాహుల్ ఉన్నారు.

 భారత్ సినిమాని క్రికెట్ టీం చూసిందని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ దన్యవాదాలు తెలిపాడు .ఇంకా తర్వాతి మ్యాచుల్లో బాగా ఆడాలని, భారత్ మొత్తం మీ వైపే ఉందని  తన బెస్ట్ విషెస్ ని తెలియజేసాడు.

"భారత్" సినిమా కొరియన్  మూవీ అయిన "ఓడ్ టు మై ఫాదర్" కి రీమేక్. అలీ అబ్బాస్ జాఫర్ దీనికి దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్ మరియు దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ౧౦౦ కోట్ల క్లబ్ లో చేరుకుని రికార్డుల దిశగా పరుగులు పెడుతుంది



మరింత సమాచారం తెలుసుకోండి: