నాని 'మజ్ను' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళం భామ అను ఇమ్మాన్యుయేల్ అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'.. అల్లు అర్జున్ 'నాపేరు సూర్య'సినిమాల్లో ఆఫర్లు పట్టేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.  ఆ తర్వాత ఎంతో నమ్మకంపెట్టుకున్న 'శైలజారెడ్డి అల్లుడు' కూడా దెబ్బేసింది. దీంతో అను టాలీవుడ్ జర్నీ స్లో అయింది. 


అయితే ఈ హిట్లు ఫ్లాపుల గోలతో సంబంధం లేకుండా ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.  తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను.. అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.  ఇప్పుడు హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా అను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా గురువారం సాయంత్రం ఒక ఫోటో పోస్ట్ చేసింది.


ఆ ఫోటోకు 'ఓహ్ లెట్ ఇట్ రెయిన్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అనువాదం తెలుసు కదా. వర్షం పడితే బాగుంటుందని అను అభిప్రాయం.  మంచి కోరికే.. ఎందుకంటే గత రెండు మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఘాటు భామల దెబ్బకు వేసవి ఉష్ణోగ్రతలు 46.. 47 డిగ్రీలు టచ్ చేసి జనాల తిత్తి తీసిన సంగతి తెలిసిందే. వర్షాలు పడితే కాస్త వారికి ఉపశమనం దొరుకుతుంది. మళ్ళీ హాటు భామల గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ ను తట్టుకునేందుకు తగిన ఎనర్జీ వస్తుంది.  మరి ఈ అను ఇమ్మాన్యుయేల్ ఏ ఊరిలో ఉంటూ.. ఏ ఊరిలో వర్షం పడాలని కోరుకుందో ఏమో కానీ హైదరాబాద్ నగరంలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో సాయంత్రం వాన కురిసింది.  ఇదంతా అను మహిమేనేమో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: