ఈ మద్య సోషల్ మీడియాలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పై రక రకాల కథనాలు వస్తున్నాయి.  ఇవన్నీ కేవలం సోషల్ మీడియా వేధిక చేసుకొని వస్తున్న వార్తలు కావడం విశేషం. వాస్తవానికి బిగ్ బాస్ 3 గురించి ఇప్పటి వరకు యాజమాన్యం ముందుకు వచ్చి ఫలానా అని ఏదీ అనౌన్స్ చేయలేదు.  అయితే బిగ్ బాస్ కన్సిస్టెంట్లు, హూస్ట్ చేసేవారు కన్ఫామ్ అయితే కానీ వారు మీడియా ముందుకు రారు..కానీ ఈలోగా సోషల్ మీడియాలో వార్తలు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి. 

గత కొంత కాలంగా బిగ్ బాస్ సీజన్ 3 లో పవన్ కళ్యాన్ రెండో భార్య రేణు దేశామ్ పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్పటికే నిర్వాహకులు ఆమెను సంప్రదించారని, అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా ద్వారా రేణూదేశాయ్‌ ఈ వార్తలపై స్పందించారు. తాను బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. కాకపోతే బిగ్‌ బాస్‌  సీజన్‌ 3కి వ్యాఖ్యాతగా అవకాశం వస్తే వదులుకోనని, తప్పకుండా పనిచేస్తానని సెలబ్రిటీ, సినీ నటి  రేణూదేశాయ్‌ స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాను ఓ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నానని, మళ్లీ నటించేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు.సూపర్‌ హిట్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనలోని నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. బిగ్‌ బాస్‌ మొదటి సీజన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌లో నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: