వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రచారం చేసిన పృథ్వీ ఎన్నికల ఫైలితాలు తరువాత కొద్దిగా మౌనం వహించాడు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివిధ పదవుల పంపిణీ చేపడుతున్న పరిస్థుతులలో ముఖ్యమంత్రి దృష్టిలో పడటానికి వ్యూహాత్మకంగా టాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేస్తూ మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. 

సినిమా వాళ్ళను నమ్మకూడదని జనం ఎందుకు అంటారో తనకు ఇప్పుడు అర్ధం అవుతోందనీ అంటూ పృథ్వీ  ఇండస్ట్రీలోని వ్యక్తుల సెటైర్లు వేసారు. జగన్ మోహన్ రెడ్డికి పాతికేళ్ల వరకూ పాలించే సమర్ధత ఉన్న నాయకుడు అని తీర్పు ఇచ్చి ప్రజలు బ్రహ్మరధం పడుతుంటే టాలీవుడ్ పెద్దలకు కనిపించడం లేదా అంటూ పృథ్వీ  ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. 

అంతేకాదు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు జగన్ ను కలిసి అభినందనలు తెలియచేస్తూ ఉంటే ఎక్కడా టాలీవుడ్ ప్రముఖులు కనిపించడం లేదు ఏమిటి అంటూ ఇండస్ట్రీ పెద్దలను పృధ్వీ కార్నర్ చేస్తున్నాడు. వాస్తవానికి ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు జగన్ ను అభినందిస్తూ ఇంకా ఓపెన్ గా అభినందనలు తెలియచేయని నేపధ్యంలో పృధ్వీ మాటలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం శ్రమించిన ఫిలిం సెలెబ్రెటీలలో ముఖ్యులు అయిన పోసాని పృధ్వీ  అలీ జీవిత రాజశేఖర్ జయసుధ విజయ్ చందర్ లాంటి ఎందరో సెలెబ్రెటీలు తమకు జగన్ వైపు నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా తమకు ఏ పదవులు  రాబోతున్నాయి అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో పలు ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి ఫిలిం ఇండస్ట్రీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడవలసి ఉన్నా రకరకాల కారణాలు వల్ల అమరావతి వైపు కానీ విశాఖపట్నం వైపు కానీ ఇండస్ట్రీ అడుగులు వేయలేకపోయింది. ఇలాంటి పరిస్థుతులలో జగన్ ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి ఎలాంటి పదకాలు ప్రవేశపెడతారు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా ఉంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: