బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి అయన ఉదారతను చాటుకున్నారు. రెండువేల మందికి పైగా రైతుల అప్పులను తీర్చి వారి పాలిట దైవంలా మారాడు. బీహార్ కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో.... తాము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకున్న అమితాబ్ వారి రుణాలను వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు చెల్లించారు.


కూతురు శ్వేతా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్ ఈ సాయం చేశారు. ఇలా చేయడం అమితాబ్ కు కొత్తేమి కాదు.... గతంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన వెయ్యి మంది రైతులను ఎన్నుకొని వారి రుణాలను బ్యాంకులకు చెల్లించారు.


తర్వాత దేశం కోసం పుల్వామా దాడిలో మృతి చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను, వారి భార్యలను ఆదుకోవాల్సి ఉందని అమితాబ్ తన బ్లాగ్ లో రాసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: