మన్మధుడు 2.. హీరో నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అంతేకాదు ఈ సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ కూడా రకులే అని ఇన్‌సైడ్ న్యూస్. కానీ టీజర్ లో రకుల్ కనిపించలేదు. ట్రయిలర్ కోసం రకుల్ ను దాచేసినట్లు కనిపిస్తోంది...అనిపిస్తోంది..అని ఫ్యాన్స్ తమ మనసుకు సర్ధి చెప్పుకుంటున్నారట. సినిమాలో నాగ్ తరువాత రకుల్ దే కీలకపాత్రని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2002లో వచ్చిన మన్మధుడు కి సిక్వెల్ అని నిన్నా మొన్నటిదాకా ప్రచారం జరిగింది. 


కానీ 2006 లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా 'ఐ డూ' ఆధారంగా మన్మధుడు 2 తయారవుతున్నట్లు లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. ఈ వార్తలే వాస్తవమైతే, ఐ డూ సినిమాలో అద్దె భార్య పాత్ర ఒకటి వుంటుంది. అదే రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నట్లు అనుకోవాలి. ఐ డూ సినిమా పక్కా తెలుగు కథ లానే వుంటుందట. పక్కాగా నాగ్ కు సూట్ కావడమే కాకుండా, ఫ్యామిలీ వాతావరణం, ఫన్ ఫుల్ గా వుంటుందట. కాకపోతే, ఇలాంటి లైన్ లు తెలుగులో సినిమా గతంలో బానే వచ్చాయి.  


టీజర్ విషయంలో కమర్షియల్ గా రాహుల్ రవీంద్రన్ ఫుల్ మార్కులు కొట్టేసాడు. అయితే సబ్జెక్ట్ పాతదానిగా అనిపించకుండా, కొత్తగా రాసుకుని, ఫన్ జనరేట్ చేస్తే నాగ్ కు మళ్లీ మంచి హిట్ దక్కుతుంది. లేకపోతే నాగ్‌తో పాటు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వక తప్పదు. అసలే నాగ్ కి ఈ మధ్య సరైన హిట్ పడక బాగా ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: