తమిళ ఇండస్ట్రీ లో వరలక్ష్మీ, విశాల్ మధ్య సాన్నిహిత్యం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది. చిన్నప్పటి నుండే స్నేహితులు అయిన వీరిద్దరు కలిసి నటించారు కూడా. వీరిద్దరి మద్య క్లోజ్ నెస్ చూసి అంతా కూడా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని కూడా అనుకున్నారు. వీరిద్దరి పెళ్లి అదుగో ఇదుగో అంటూ వార్తలు కూడా వచ్చాయి. వరలక్ష్మి తండ్రి గతంలో శరత్ కుమార్ నడిగర్ సంఘంకు ప్రెసిడెంట్ గా చేశాడు.


ఆయనపై విశాల్ పోటీ చేసి గెలిచిన సమయంలో కూడా ఇద్దరి మద్య స్నేహం చెక్కు చెదరలేదు. నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్ పై విశాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆ తర్వాత కూడా విశాల్ తో వరలక్ష్మి నటించింది. కాని ఇప్పుడు వరలక్ష్మికి విశాల్ పై కోపం వచ్చింది. తన తండ్రిని పదే పదే టార్గెట్ చేస్తున్న కారణంగా విశాల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది.


విశాల్ విడుదల చేసిన వీడియోపై వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుడిగా నువ్వు గెలిచిన తర్వాత చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం చేసుకోవాలి.. కాని ఇంకా కూడా పాత వారిపై విమర్శలు చేస్తూ గెలిచేందుకు ప్రయత్నించడం దిగజారుడు తనం అవుతుందని చెప్పుకొచ్చింది. ఇంత నీచానికి దిగజారుతావని తాను భావించలేదు అంటూ వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి మద్య ఇన్నాళ్లుగా ఉన్న మంచి స్నేహం ఈ దెబ్బతో బ్రేకప్ అయినట్లే అంటూ అంతా భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: