‘సాహో’ టీజర్ విద్వంసం కొనసాగుతున్న నేపధ్యంలో ఈమూవీ చేయబోతున్న బిజినెస్ గురించి ఈమూవీకి రాబోతున్న కలక్షన్స్  గురించి ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా కలెక్షన్స్ పరిధి పెరిగింది అని ప్రచారం జరిగినా టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బాహుబలి’ కాకుండా  జెన్యూన్‌ గా వంద కోట్లు షేర్‌ దాటిన చిత్రాలు ‘రంగస్థలం’ ‘ఖైదీ నెంబర్ 150’ మాత్రమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

మిగతా టాప్ హీరోల మూవీ నిర్మాతలు తమ హీరోలను మెప్పించడానికి మాత్రమే జరుగుతున్న ప్రచారం కానీ అసలు వాస్తవాలు వేరు అని ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం. టాప్ హీరో సినిమాలు టిక్కెట్ల రెట్లు పెంచినా ఆ మూవీ కలక్షన్స్ 100 కోట్ల నెట్ స్థాయిని దాటడానికి నానాపాట్లు పడుతున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో ఒక మామూలు కథతో కేవలం భారీ ఫైట్స్ గ్రాఫిక్స్ ను నమ్ముకుని విడుదల అవుతున్న ‘సాహో’ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ మార్కెట్ పై వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు మాత్రమే అని అంటున్నారు. 

ముఖ్యంగా ఈమూవీ సీడెడ్ రైట్స్ కోసం బయ్యర్ 25 కోట్లు పెట్టి ‘బాహుబలి’ తో సమానంగా కొన్నారు అదేవిధంగా ఈమూవీ కర్ణాటక రైట్స్ కోసం ఒక బయ్యర్ ఇరవై ఏడు కోట్లకు కొన్నారు అని వస్తున్న వార్తలు ఎంత వరకు వాస్తవాలు అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు సందేహం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పుడు ‘సాహో’ మార్కెట్ పై వస్తున్న లీకులు నిజం అయితే ఈమూవీకి ‘రంగస్థలం’ మూవీకి మించి కలక్షన్స్ వచ్చినా బయ్యర్లకు వర్కౌట్ కాదు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: