'నీది నాది ఒకే కథ' చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు 'వేణు ఉడుగుల', కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహరోయిన్ లుగా పెట్టి తెలంగాణా ప్రాంతంలో 1990 నాటి సామజిక పరిస్థితులు ప్రతిబింబించే పీరియాడిక్ సోషల్ డ్రామాగా 'విరాటపర్వం' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోస్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
అయితే తమ సినిమా ఓపెనింగ్ కి కూడా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న రానా - సాయి పల్లవి హాజరు కాలేదు. ఎంత బిజీగా ఉంటే మాత్రం తమ సినిమా లాంచింగ్ కి కూడా రాకపోవడం ఆ సినిమా డైరెక్టర్ కి బాధ కలిగించే అంశమే. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఇక వేణు 'నీది నాది ఒకే కథ' చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమానూ రానా క్యారెక్టర్ పైనే నడుపుతాడట.