మళయాళ ప్రేమం సినిమాలో మలర్ పాత్రతో సౌత్ ఆడియెన్స్ ను అలరించిన సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడు ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇదిలాఉంటే మళయాళంలోనే కాదు ఈమధ్య కోలీవుడ్ లో కూడా సాయి పల్లవి ఛాన్సులు అందుకుంటుంది. 


అయితే తమిళంలో సినిమాలైతే చేస్తుంది కాని అందుకు తగినట్టుగా ఫలితాలను మాత్రం రాబట్టలేకపోతుంది. అక్కడ చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి. రీసెంట్ గా సూర్య హీరోగా చేసిన ఎన్.జి.కే కూడా సాయి పల్లవికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇదిలాఉంటే తను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఒకే రకమైన పాత్రలను నటించడం కూడా మైనస్ అంటున్నారు.


ముఖ్యంగా సాయి పల్లవి హీరో భార్యగా నటించడం రెండు మూడు సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. ఇదిలాఉంటే సినిమాల్లో భార్త పాత్రల్లో చేస్తున్న సాయి పల్లవి నిజ జీవితంలో మాత్రం పెళ్లి మాత్రం చేసుకోనని చెబుతుంది. తన లైఫ్ లో పెళ్లికి చోటు లేదంటుంది ఈ అమ్మడు. అలా ఎందుకు అంటే పెళ్లి చేసుకుని తాను వెళ్లిపోతే అమ్మా నాన్నలను ఎవరు చూసుకుంటారని చెప్పుకొస్తుంది.


ఫిదా సినిమాలో భానుమతి పాత్ర లానే నిజ జీవితంలో కూడా ఆలోచిస్తున్న సాయి పల్లవికి ఆ సినిమాలో వరుణ్ తేజ్ లానే ఇల్లరికం వచ్చే అల్లుడు దొరికితే బాగుంటుంది. అయితే కేవలం తల్లిదండ్రులను విడిచి పెట్టడమే ఆమెకు ఇష్టం లేదా అసలు పెళ్లి మీదే ఆసక్తి లేదా అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: