కియారా.. సోయగాల నయాగరా.. భరత్ అనే నేను సినిమా ద్వారా ఆమె గ్లామర్ కు తెరలేపింది. బోయపాటి వినయ విధేయ రామ సినిమా ద్వారా ఈ అమ్మడు టాలీవుడ్ లో పాతుకుపోవాలని చూసినా.. కుదరలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ కు వెళ్ళింది.
అంతకు ఈ భామ లస్ట్ స్టోరీస్ అనే ఒక అడల్ట్ కంటెంట్ తో వెబ్ సీరీస్ చేసింది. ఇందులో స్వయంతృప్తికి సంబంధించిన విషయాలు ఉంటాయి. వీటిని ఇందులో చక్కగా చూపించారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమా చేస్తోంది.
బాలీవుడ్ లో ఈ అమ్మడు బిజీగా ఉంటూనే.. కియారా ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. మరీ బిజీగా ఉందేమో కానీ రెండు ఫోటోలకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. కనీసం ఎమోజి కూడా పెట్టలేదు. అయితే ఫోటోలు మాత్రం తన స్టాండర్డ్ కు తగ్గట్టే స్టైలిష్ గా ఉన్నాయి. రంధ్రాల డిజైన్ ఉండే తెలుపు రంగు ఛోళీ.. అదే రకమైన థై స్లిట్ లెహెంగా ధరించి ఒక గొల్లభామలాగా వయ్యారంగా నిలబడింది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. సినిమాల్లో సంపాదించే సంపాదన కంటే ఇలా ఫోటో షూట్ ద్వారా వచ్చే సంపాదన అధికం. అందుకే మన హీరోయిన్లు ఫోటో షూట్ లు ఎక్కువగా చేస్తున్నారు.