ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే యువి క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. 

ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన గిబ్రాన్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు నెటిజన్లు. ఇక కొద్దిరోజుల క్రితం ఈ సినిమా సంగీత దర్శకులుగా ఉన్న శంకర్-ఎహసాన్-లాక్ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సాహో నుండి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన గిబ్రాన్ నే తమ సాహోకు సంగీత దర్శకుడుగా తీసుకోవాలని యునిట్ ఫిక్స్ అయిందట. నిజానికి సుజిత్ ఇదివరకటి సినిమా రన్ రాజా రన్ కు కూడా గిబ్రాన్ మ్యూజిక్ ఇవ్వడం, ఆ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది. 

అందుకే వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుని రిస్క్ చేయడం కంటే గిబ్రాన్ నే తీసుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ కూడా అతడే సూపర్ గా ఇవ్వగలడు అని భావించి అతన్నే తీసుకున్నారట. అయితే ఇది కేవలం ప్రచారం అవుతున్న మాత్రమే, ఎందుకంటే ఈ విషయమై సాహో టీమ్ నుండి అధికారిక ప్రకటన రావలసి వుంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో వెయిట్ చేయాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: