కృతి సనన్ తెలుగులో మహేష్ సరసన '1 నేనొక్కడినే ' సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడైతే బాలీవుడ్ లో దూసుకుపోతోంది.  'హీరోపంటి'.. 'దిల్వాలే'.. 'బరేలీ కి బర్ఫీ'.. 'లుకా చుప్పి' లాంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఈమధ్యే ఇన్స్టాగ్రామ్ లో కృతి ఫాలోయర్ల సంఖ్య  22 మిలియన్ల మార్క్ కు చేరింది.


దీంతో పూర్తిగా ఎగ్జైట్ అయిన కృతి నెటిజన్లను థ్రిల్ చేయాలని నిర్ణయించుకుంది. ఒక అందమైన బీచ్ లో నలుపు రంగు బికినీ ధరించి అంతకంటే అందంగా నవ్వుతూ పోజిచ్చింది. తెలుపు రంగులు ఇసుక.. వెనకేమో పచ్చటి చెట్లు.. ఫోటో అదిరిపోయిందంతే.  బికినీని కళాత్మకంగా ధరించడం.. ముట్టుకుంటే కందిపోయే సుకుమారిలా కనిపించడమే కాదు.  తన ముందు ఇసుకలో 22 అంటూ నంబర్ రాసింది. 


22 మిలియన్ ఫాలోయర్లకు ఇంతకంటే క్రేజీ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? ఈ ఫోటోకు కృతి ఇచ్చిన క్యాప్షన్ "22 మిలియన్లు నన్ను ఇలా మురిసిపోయేలా చేశాయి. 22మిలియన్ ఆన్ ఇన్స్టా. మీ అందరికీ నా లవ్"భామ కత్తిల్లాంటి బ్లాక్ బికినీ ఫోటో పోస్ట్ చేసింది కాబట్టి కామెంట్లు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. "కమ్ కపడే.. కడక్ బ్యూటీ".. "నీ బికినీ మమ్మలి మురిపిస్తోంది".. "కృతియన్స్ సంఖ్యకు మరో సున్నా చేరాలి".  లాస్ట్ కామెంట్ అర్థం అయింది కదా.  కృతి ఫ్యాన్స్ కు కృతియన్స్ అని పేరు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: