రెజీనా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి అనేక సినిమాల్లో నటించింది.  మెగా హీరోల సినిమాల్లో వరసగా యాక్ట్ చేస్తూ మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  ఇదిలా ఉంటె, గత కొన్ని కొంతకాలంగా ఈ హీరోయిన్ టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా కనిపించడంలేదు.  కోలీవుడ్ లో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది.  అటు బాలీవుడ్ లో కూడా తన ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసే క్రమంలో బిజీగా మారిపోయింది. 

ఇప్పుడు ఈ హీరోయిన్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు వస్తున్నాయి.  మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియడం లేదు.  ఆన్ లైన్ టెక్నాలజీ వాడకం విపరీతమయ్యాక ఏది నిజమో ఏది అబద్దమో గుర్తించే లోపే ఏదైనా వార్త క్షణాల్లో దేశాల సరిహద్దులు దాటిపోతోంది. అందులోనూ అది సెలబ్రిటీకి సంబంధించినది అయితే ఇక దాని రెక్కలకు పగ్గాలు వేయడం కష్టంగా ఉంది. అందులోనూ హీరోయిన్ గురించి అయితే చెప్పేదేముంది. ఈ మధ్య తెలుగులో కనిపించడం బొత్తిగా మానేసిన రెజీనాకు ఈ నెల 13న నిశ్చితార్థం అయ్యిందంటూ ఓ ప్రముఖ నేషనల్ మీడియాలో రావడంతో ఇది నిజమే అనుకున్న అభిమానులు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.

నిజానికి ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని సన్నిహితులు అంటున్నారు. రెజీనా నేరుగా మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకవేళ నిజం కాబట్టి  లేదేమోనని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ బిజీగా ఉండటమే అసలు రీజన్ అని ఫ్రెండ్స్ వెర్షన్.  చాలా కాలం తర్వాత రెజీనా తెలుగు సినిమాలో కనిపించింది గత వారం వచ్చిన సెవెన్ లోనే. కీలకమైన పాత్రే అయినప్పటికీ కంటెంట్ మెప్పించేలా లేకపోవడంతో చేదు ఫలితం తప్పలేదు.

ప్రస్తుతం రెజీనా కోలీవడ్ లో యమా బిజీగా ఉంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో గతంలో నెంజమ్ మార్పత్తిలై ఏవో కారణాల వల్ల విడుదల కాకుండా ఆగిపోయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో పార్టీ -అరవింద్ స్వామితో కల్లాపర్త్-చింబు దేవన్ దర్శకత్వంలో కసడా తపర సినిమాలు చేస్తోంది. తెలుగుకు వస్తే అడవి శేష్ తో చేసిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు ఆగస్ట్ 23 విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: