వరుసగా ఆరు ఫ్లాపులు చూసిన తర్వాత మొన్నే "చిత్రలహరి" సినిమాతో హిట్ అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ విజయం ఆచి తూచి అడుగు వేయాలనుకుంటున్నాడట. ముఖ్యంగా ఫార్ములా కథలకి చెక్ పెట్టాలనుకుంతున్నాడట. దాంతో సాయి కమిట్ అయ్యే ప్రతీ ప్రాజెక్టు చర్చకు దారి తీస్తోంది.  తన తర్వాతి చిత్రం దర్శకుడు మారుతితో ఉందన్న విషయం తెలిసిందే.

 

మారుతితో చేస్తున్న సినిమా వర్కవుట్ అవుతుందనే అనుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో సాయి మరో కొత్త చిత్రం ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం కూడా అతని కెరీర్ కు ప్లస్ అవుతుందా.?అందుతున్న సమాచారం ప్రకారం సాయి తేజ ...దర్శకుడు దేవకట్టా కథకు ఓకే చెప్పాడని సమాచారం.వెన్నెల, ప్రస్థానం లాంటి విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా.

 

తర్వాత ఆయన చేసిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో గ్యాప్ వచ్చేసింది.ఈ గ్యాప్ లో తయారు చేసుకున్న ఓ స్టోరీలైన్ తో  దేవకట్టా రీసెంట్ గా సాయి తేజను కలిసారట. పూర్తిగా సీరియస్ గా సాగే సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ప్రస్దానంకు సీక్వెల్ గా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే యూత్ ని ఆకట్టుకునే పాత్రల్లోకి పరకాయప్రవేశం చేస్తున్న సాయి తేజ మళ్లీ యాక్షన్ తో కూడిన సీరియస్ సబ్జెక్ట్ ఒప్పుకోవటం,  ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

 

అయితే దేవకట్టా మామూలు డైరక్టర్ కాదు. డెప్త్ తో కూడిన డైలాగులతో థియోటర్స్ దద్దరిల్లేలా చేయగలరు. షాట్ డివిజన్ కూడా బాగుంటుంది. సినిమా యావరేజ్ అనిపించుకున్నా హీరోకు మంచి పేరు వస్తుంది. దానికి తోడు దేవకట్టా ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సాయి  భయపడాల్సిన పనిలేదని అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: