అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో  విపరీతంగా  క్రేజ్ పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు తీస్తూ, హిట్ల మీద హిట్లు సాధిస్తున్నాడు.త్వరలో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల విడుదల కాబోతోంది.  ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు.

 

ఈ సినిమా తర్వాత తమిళంలో కూడా ఒక సినిమా చేయనున్నాడట.తర్వాత క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రైటర్ పాత్రలో కనిపించబోతున్నాడట.

 

అంతేకాదు ఈ సినిమాలో మొత్తం మూడు పాత్రలు ఉండగా మూడింటిలోనూ తనే హీరో గా కనిపించబోతున్నాడట.అయితే మూడు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని… కానీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయని…. అదే అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది.  ఈ సినిమా గిరించి అప్ డేట్స్ తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

 

రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నాడు.ఇందులో ఒక పాత్రలో విజయ్ దేవరకొండ కార్మిక నాయకుడిగా… మరో పాత్రలో ఎన్నారైగా కనిపించబోతున్నాడట. మరి మూడవ పాత్రలో విజయ్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: