బాహుబలి సినిమా విజయంతో రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసాడు. ఒక్కసారిగా ప్రపంచ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు. అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ సినిమా. మరి ఇంతటి విజయాన్ని అందుకున్న తర్వాత రాజమౌళి తన తర్వాతి చిత్రం ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూసారు.

 

రాజమౌళి తన తర్వాతి సినిమాని ప్రకతించగానే అభిమానుల్లో ఉత్సాహం పొంగింది. తన తర్వాతి సినిమా ఆర్ ఆర్ ఆర్ 1920 బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథతో ఉంటుందట. ఈ సినిమాలో రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతుంది.

 

రెండు నెలల గ్యాప్ తర్వత  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ ఎలా జరుగుతుందో..ఎవరిపై షూట్ చేస్తున్నారో..ఈ సినిమా సెకండ్ హీరోయిన్ ను ఫిక్స్ చేసారా..ఇవేమి బయటకు రావడం లేదు. జస్ట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందనే వార్త తప్ప, మిగతా ఏ విషయాలు కూడా బయటకు రావడం లేదు. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ టెన్షన్ చాలాదన్నట్లు మరో న్యూస్ ఇప్పుడు ఇంకాస్త టెన్షన్ పెడుతుంది. అదేంటి అంటే ఎన్టీఆర్ , చరణ్ లు ఆర్ఆర్ఆర్ పూర్తి అయినా తర్వాత ఎవరి డైరెక్షన్లో సినిమా చేయాలో అర్థం కావట్లేదట.

 

వీరిద్దరితో కొరటాల సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే ఎవరితో చేయాలో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం కొరటాల చిరంజీవి తో ఓ సినిమా చేయబోతున్నాడు. చిరంజీవితో సినిమా పూర్తి కాగానే మెగా హీరోతో చేయడం కన్నా ఓ చిన్న బ్రేక్ ఇచ్చి తారక్ తో పూర్తి చేస్తే బాగుంటుందని సన్నిహితులు , సినీ ప్రముఖులు కొరటాల కు సూచిస్తున్నారట. కానీ కొరటాల కు మాత్రం ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాలో తెలియడం లేదట. మరి చివరికి ఏం డిసైడ్ చేస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: